2025

తెలంగాణలో చలి తీవ్రత.. 8.2 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు

తెలంగాణలో చలి తీవ్రంగా పెరుగుతోంది. ఆదిలాబాద్‌ అటవీ బెల్ట్ లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు తగ్గుతున్నాయి. గురువారం ఉదయం కుమురం భీమ్ ఆసిఫాబాద్‌లోని తిర్యాణి మండలంలో రాష్ట్రంలోనే కనిష్టంగా 8.2 డిగ్రీలు నమోదైంది. రుద్రంగి వద్ద 9.1, నేరడిగొండలో 9.5 డిగ్రీలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని 29 జిల్లాల్లో 25 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలుగా నమోదయ్యాయి. వచ్చే 3 రోజుల్లో చలి మరింత పెరుగుతుందని ఐఎండీ హెచ్చరించింది.

తెలంగాణలో చలి తీవ్రత.. 8.2 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు Read More »

కోదాడ;యూనియన్ బ్యాంక్ ఆఫ్ భీమా తో ఖాతాదారులకు ధీమా

గురువారం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖమ్మం క్రాస్ రోడ్ శాఖలో ఖాతాదారు గుండు రవి మరణానంతరం, బ్యాంకు బీమా పథకం కింద మంజూరైన రూ. 2 లక్షల చెక్కును నామినీ అయిన భార్య గుండు శిరీషకు బ్రాంచ్ మేనేజర్ నారాయణ నాయక్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం రూ. 350 వార్షిక ప్రీమియంతో రూ. 2 లక్షల జీవిత బీమా అందుబాటులో ఉందని, సేవింగ్స్ ఖాతాదారులు రూ. 10 లక్షల వరకు తక్కువ

కోదాడ;యూనియన్ బ్యాంక్ ఆఫ్ భీమా తో ఖాతాదారులకు ధీమా Read More »

Ind Vs Sa తొలి టెస్టు.. భారత్ బౌలింగ్ (VIDEO)

భార‌త్‌-సౌతాఫ్రికా మ‌ధ్య తొలి టెస్టు సిరీస్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ప్రారంభమైంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. టీమిండియా ఇద్దరు స్పెషలిస్ట్‌ వికెట్‌ కీపర్లతో బరిలోకి దిగింది. రిషబ్‌ పంత్‌, ధ్రువ్‌ జురెల్‌కు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు దక్కింది. అక్షర్‌ పటేల్‌ కూడా కమ్‌బ్యాక్‌ ఇచ్చాడు. ఇరు జట్లు ఇద్దరు ఫాస్ట్‌ బౌలర్లతో ఆడుతున్నాయి.

Ind Vs Sa తొలి టెస్టు.. భారత్ బౌలింగ్ (VIDEO) Read More »

మునగాల: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

గురువారం రాత్రి మునగాల మండలం ఆకుపాముల వద్ద జాతీయ రహదారిపై డిసిఎం వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరొకరు మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తి జేసిబీ డ్రైవర్ సిరాజ్ గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మునగాల: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి Read More »

ఢిల్లీ పేలుడు ఘటనలో మరో కారు గుర్తింపు

ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసులో మరో కీలక ఆధారం బయటపడింది. దర్యాప్తు అధికారులు మూడో కారును గుర్తించారు. జిహాదీ షాహిన్‌ పేరిట రిజిస్ట్రేషన్ చేసిన మారుతీ బ్రెజా వాహనం అల్‌-ఫలాహ్‌ యూనివర్సిటీ ప్రాంగణంలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కారు కూడా పేలుడు కుట్రలో భాగమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇప్పటికే రెండు వాహనాలపై కీలక ఆధారాలు దొరికిన నేపథ్యంలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఢిల్లీ పేలుడు ఘటనలో మరో కారు గుర్తింపు Read More »

కోదాడ: వెయిట్ లిఫ్టింగ్, కరాటే పోటీల్లో రాణించడం అభినందనీయం

కోదాడ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు వెయిట్ లిఫ్టింగ్, కరాటే క్రీడల్లో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. భద్రాచలంలో జరిగిన వెయిట్ లిఫ్టింగ్, నల్లగొండలో జరిగిన కరాటే పోటీల్లో వీరు ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా విద్యార్థినులను ఎంఇఓ సలీం షరీఫ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సుశీలబాయి, పీడీ నీరజ పాల్గొన్నారు.

కోదాడ: వెయిట్ లిఫ్టింగ్, కరాటే పోటీల్లో రాణించడం అభినందనీయం Read More »